Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

కళ్ళు తాగిన కోతి పవన్‌ కళ్యాణ్‌

గడప గడపలో ప్రజలు హారతులు ఇస్తున్నారు
అన్ని పార్టీలు ఏకమైన 2024లో వైసీపీ దే విజయం

వైసీపీ జిల్లా అధ్యక్షులు, టిటిడి పాలకమండలి సభ్యులు, కనిగిరి శాసనసభ్యులు బుర్ర మధుసూదన్‌ యాదవ్‌
విశాలాంధ్ర-పామూరు : వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణను తట్టుకోలేని జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ కల్లు తాగిన కోతి లాగా గంతులేస్తున్నాడని, మా నాయకులను అనరాని మాటలను అనిన పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలను వైసిపి జిల్లా అధ్యక్షులు, టిటిడి పాలకమండలి సభ్యులు, కనిగిరి శాసనసభ్యులు బుర్ర మధుసూదన్‌ యాదవ్‌ తీవ్రంగా ఖండిరచారు. గురువారం పామూరు పంచాయతీ పరిధిలోని గోపాలపురంలో 20 లక్షలు పంచాయతీ నిధులుతో సైడ్‌ కాలువ సిమెంటు రోడ్డు నిర్మాణమునకు ఉపసర్పంచ్‌ యాదాల వెంకట సాయి కిరణ్‌ ఆధ్వర్యంలో ఎంపీపీ గంగసాని లక్ష్మీ హుస్సేన్‌రెడ్డితో కలసి బుర్ర మధుసూదన్‌ యాదవ్‌ భూమి పూజ చేశారు. అనంతరం ఎంపీటీసీ షేక్‌ అబ్దుల్‌ ఆధ్వర్యంలో నాలుగో సచివాలయం పరిధిలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బుర్ర మధుసూదన్‌ యాదవ్‌ పాల్గొన్నారు. భోజన విరామ సమయంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు షేక్‌ చాంద్‌ బాషా (సెంట్రింగ్‌ బుజ్జి) నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుర్ర మధుసూదన్‌ యాదవ్‌ మాట్లాడుతూ గడపగడపకు వెళ్తుంటే ప్రజల హారతులు ఇచ్చి ఆహ్వానిస్తుండడం ఆనందదాయకముగా ఉందన్నారు. ఏనాడు ఏ ప్రభుత్వంలో అమలు జరగని సంక్షేమ పథకాలు ను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నేరుగా అందిస్తూ ఉండడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు నాయుడులు కలిసి కుట్రలు ఫన్నీ అన్ని పార్టీలు ఏకమై పోటీ చేసిన సింగిల్‌ గా పోటీ చేసి 2024 ఎన్నికల్లో విజయం సాధిస్తామని రెండోసారి జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తధ్యమన్న జీమాను బుర్ర మధుసూదన్‌ యాదవ్‌ వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సింగల్‌ విండో చైర్మన్‌ పువ్వాడ వెంకట సుజాత, రాంబాబు కల్లూరి రామిరెడ్డి, మండల కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌ నాయబ్‌ రసూల్‌, ఏఎంసి వైస్‌ చైర్మన్‌ దర్శి రాము, వైస్‌ ఎంపీపీ షేక్‌ రషీద్‌, చల్లా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img