విశాలాంధ్ర`సీఎస్పురం : వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని చిన్నచిన్న మనస్పర్ధలు వీడి కలసికట్టుగా అందరూ పనిచేయాలని మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు బొమ్మనబోయిన వెంకటేశ్వర్లు (వెంగయ్య) పార్టీ శ్రేణులకు సూచించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ మండల సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా వెంగయ్య మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా టీడీపీ అధికారంలోకి వస్తుందని కనిగిరి ఎమ్మెల్యేగా ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడులు ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. దీనికోసం క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త గ్రామస్థాయిలో బలంగా తయారై అధికార పార్టీ వైసీపీ ఆగడాలను ప్రేజలకు తెలియచేస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో వారికి తెలియజేయాలని అన్నారు. ప్రతి ఓటరు తప్పకుండా సైకిల్ గుర్తుకే ఓటు వేసేలా చేయాలని అన్నారు. అలాగే ఎంఎల్సి ఎన్నికల నేపథ్యంలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారిచేత ఓట్లు చేర్పించి టీడీపీ బలపరిచిన అభ్యర్ధిని గెలుపుకు తోడ్పడాలని అన్నారు. అనంతరం మండలంలోని 23 పంచాయితీలకు పార్టీ ఇన్చార్జిలను నియమించారు. ఈ కార్యక్రమంలో సీఎస్పురం ఉప సర్పంచి పాములపాటి నరసయ్య, ఒంగోలు పార్లమెంట్ అధికార ప్రతినిథి షేక్ రజ్జాబ్బాషా, కనిగిరి నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు జె లక్ష్మీదేవి, అంబవరం సర్పంచి కొండయ్యరాజు, మాజీ సర్పంచి ఎన్సి మాలకొండయ్య, పార్టీ సీనియర్ నాయకులు అట్లూరి రామక్రిష్ణంరాజు, మాజీ జడ్పీటీసీ దర్శి నాగేశ్వరరావు, ముస్లిం మైనార్టీ మండలాధ్యక్షులు షేక్ మహబుబ్బాషా, టీడీపీ నాయకులు తోట శ్రీనివాసులు, దేవండ్ల తిరుపతయ్య, యేసురత్నం, కె వెంకటస్వామి, యేసు, కోనంగి వెంకటకొండయ్య, బోయన మాలకొండయ్య, మాదినేని శ్రీనివాసులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.