Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కోర్ట్ విధులను బహిష్కరించిన న్యాయవాదులు

విశాలాంధ్ర – కనిగిరి : కాకినాడ బార్ అసోసియేషన్ సభ్యుడు మరియు ప్రత్యేక పి పి పోస్కో కోర్ట్ ఎండీ అక్బర్ అజాం హత్యకు నిరసనగా బుధవారం కనిగిరి కోర్టు ఆవరణలో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. దీంతో పాటుగా దేశావ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్నా దాడులకు నిరసన తెలియ చేస్తూ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ వలి, వైస్ ప్రెసిడెంట్ పాశం పిచ్చయ్య, ట్రెసరర్ ఎస్డీ యం షాహిద్ , యూనియన్ సభ్యులు ప్రఫుల్లకుమార్, సిహెచ్ సాల్మన్ , షేక్ వీరావాలి, ఏ బాలిరెడ్డి, బి మోహన్, బంగారు బాబు, విద్యా యాదవ్, ఎం చంద్రబాబు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img