Friday, April 19, 2024
Friday, April 19, 2024

అందే మల్లీశ్వరీ మృతి తిరనిలోటు

మార్కాపురం : నమ్మిన సిద్ధాంతం కోసం తుదిశ్వాస వరకు కమ్యూనిస్టు పార్టీలో కొనసాగిన సీపీఐ మహిళా నాయకురాలు అందే మల్లీశ్వరీ మృతి వారి కుటుంబానికే గాకుండా ప్రజా ఉద్యమాలకు తిరనిలోటని జిల్లా మున్సిపల్ కార్మికుల సంఘం (ఎఐటియుసి) కార్యదర్శి ఎస్ కె కాశిం అన్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక పూల సుబ్బయ్య శాంతి భవన్ లో మల్లీశ్వరీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాశిం మాట్లాడుతూ సతీమణి గా అందే నాసరయ్య కు చేదోడు వాదోడుగా వుంటూ పార్టీలో చురుకైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ నెల 7 వ తేది మల్లీశ్వరీ సంస్మరణ కార్యక్రమం వారి నివాసం వద్ద జరుగనుందని అన్నారు. మల్లీశ్వరి చేసిన సేవలను మున్సిపల్ కార్మికులు కొనియాడారు. ఆమె మృతి పట్ల మున్సిపల్ కార్మికులు తీవ్ర సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img