Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ఘనంగా ఆజాదిక అమృత్ మహోత్సవం

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : మండలంలోని పలు గ్రామాల్లో ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమాలు శనివారం ఘనంగా నిర్వహించారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు ఆజాదిక అమృత్ మహోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉప్పుగుండూరు గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఆజాదిక అమృత్ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులచే 350 అడుగుల జాతీయ త్రివర్ణ పతాకం తో ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇమ్మిశెట్టి నరేంద్ర, ఇమ్మిశెట్టి అనిల్, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. హెచ్ నిడమానూరు గ్రామంలో కోణం రామిరెడ్డి జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఎన్ సి సి విద్యార్థులు, గ్రామ సచివాలయాల సిబ్బంది ఆధ్వర్యంలో ఆజాదిక అమృత్ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వడ్డిముక్కల శ్రీనివాసరావు ఎన్ సి సి అధికారి నన్నెబోయిన వెంకటప్పయ్య, రమణారెడ్డి, పరంధామ రెడ్డి, మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img