విశాలాంధ్ర-అర్ధవీడు : మండలంలోని బోగోలులో గ్రంథాలయాన్ని సర్పంచ్ చేగిరెడ్డి పోతిరెడ్డి, మాజీ ఎంపీపీ నన్నెబోయిన రవి కుమార్ యాదవ్ శనివారం ప్రారంభించారు. గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయడం పట్ల సంతోషంగా ఉందని అభిప్రాయపడ్డారు. దినపత్రికలు , వివిధ పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. గ్రంథాలయం ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు విద్యార్థులు సంతోష వ్యక్తం చేశారు.