Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బొలోరో వాహనం బైక్ ఢీ – ముగ్గురు మృతి

యర్రగొండపాలెం లో ఘోర రోడ్డు ప్రమాదం

విశాలాంధ్ర-యర్రగొండపాలెం : యర్రగొండపాలెం కస్తూరిభా గాంధీ విద్యాలయం సమీపంలో బొలోరో వాహనం, బైక్ ఢీకొని ముగ్గురు మృతి చెందిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు త్రిపురాంతకం మండలం ఒడ్డుపాలెం గ్రామానికి చెందిన భార్య భర్తలు పనుల నిమిత్తం యర్రగొండపాలెం వచ్చి తిరుగు ప్రయాణంలో ఆ ప్రాంతంలో బొలోరో వాహనం వేగంగా వస్తూ బైక్ ను ఢీ కొట్టడంతో భర్త రంగయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. భార్య మరియమ్మ ను ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తున్న సమయంలో ఆమె మృతి చెందింది. అలాగే బొలోరో వాహనం నడుపుతున్న కాకానికి చెందిన భాగ్య రాజు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. అలాగే వాహనంలో ఉన్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం కారును తప్పించబోయి కట్ చేయడంతో బైక్ ను ఢీ కొట్టిందని క్షతగాత్రులు తెలిపారు. యర్రగొండపాలెం ఎస్సై కోటయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img