Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఈనెల31 లోపు పెండింగ్ లో ఉన్న క్లయిమ్ లను పూర్తి చేయండి

విశాలాంధ్ర సంతనూతలపాడు : ఈనెల 31వ తేదీ లోపు పెండింగ్ ఉన్న ఓటర్ లిస్ట్ ల లోని 6,7 ,8 పెండింగ్ లో వున్న క్లయిమ్ లను పూర్తిచేయాలని స్థానిక తాసిల్దార్ పిన్నిక మధుసూదన్ రావు కో రారు. స్థానిక అంకమ్మ తల్లి కళ్యాణ మండపంలో మంగళవారం జరిగిన నియోజకవర్గ స్థాయి బి ఎల్ వో ల సమావేశంలో ముఖ్య అతిథిగా హజరై మధుసూదన్ రావు మాట్లాడుతూ ఆగస్టు 1 నుండి ఎన్నికల కార్యక్రమానికి కొత్త సైట్ రాబోతుందని ఈ నెలాఖరు లోపు పెండింగ్ లో ఉన్న 6, 7,8క్లెయి మ్ లను వెంటనే పరిష్కారం చేయాలని తెలిపారు. సమావేశంలో మద్దిపాడు తాసిల్దార్ లక్ష్మీనారాయణ సంతనూతలపాడు డి టి శ్రీనివాసరావు చీమకుర్తి డీటీ సాయి మద్దిపాడు డి టి మీనా నాగులుప్పలపాడు డి టీ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img