Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

క్రీడాకారుడు మహేష్ కు అభినందన

విశాలాంధ్ర – ఒంగోలు : ఇటీవల ఢిల్లీలో జరిగిన బాక్సింగ్ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన ఒంగోలు కమ్మ పాలెం కు చెందిన వడ్డీల్ల మహేష్ చౌదరి ని సూర్య శ్రీ దివ్యంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మండవ మురళీకృష్ణ అభినందించి సత్కరించారు. మండవ మురళీకృష్ణ కార్యాలయంలో జరిగిన అభినందన సభలో శాలువా కప్పి అభినందించారు. చిన్న వయసులోనే క్రీడల పట్ల మక్కువ ఉన్నా, ఆర్థిక స్తోమత లేని మహేష్ ను సూర్య శ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయుడు తూమాటి వెంకట్ సహకారంతో పాతికవేల రూపాయలను అందించి ఢిల్లీకి పంపడం జరిగిందని అన్నారు. తమ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రకాశం జిల్లా కు మంచి పేరు తీసుకురావడం ఆనందించదగ్గ విషయమని అన్నారు. ఎవరైనా ప్రతిభ ఉండి పేదరికంతో రాణించలేని క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు. ఐ టి సి మేనేజర్ గోబాల్ కన్నన్, బాక్సింగ్ కోచ్ తోకల జాన్ మార్క్, గుండ్లకమ్మ సాహిత్య వేదిక అధ్యక్షులు మండవ సుబ్బారావు , చైతన్య స్వర భారతీయ అధ్యక్షులు నూక తోటి శరత్ బాబు, సూర్య శ్రీ దివ్యంగుల చారిటబుల్ ట్రస్ట్ సెక్రెటరీ షేక్ సర్దార్ భాష, నేరెళ్ల శ్రీనివాసరావు ,గొల్లపూడి రవి, మేడిశెట్టి సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img