Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కోవూరు చెరువు కలుజు నిర్మాణం కొరకు సిపిఎం నిరసన

విశాలాంధ్ర, కోవూరు, ఎన్నో ఏళ్ల నుండి ప్రమాదపు అంచుల్లో, కోవూరు కలుజు ఉందని, పలు సార్లు, పాలకులు, అధికారులు దృష్టికి సిపిఎం పెట్టినప్పటికి, చోద్యం చూస్తున్న నేపథ్యంలో, సోమవారం, కలుజు వద్ద సిపిఎం, నిరసన చేపట్టింది, కోవూరు సిపిఎం మండలం, కన్వినర్, గండవరపు శేషయ్య, మాట్లాడుతూ, వాహనచోదకులు పలు మార్లు ప్రమాదాలకు గురి అయిన సంఘటనలు ఉన్నాయని, శత కోటి, ప్రభుత్వం చేసే ఖర్చులో, కోవూరు నియోజకవర్గం వర్గం ఎమ్మెల్యే, ప్రసన్న కుమార్ రెడ్డి, కూడ పట్టించు కోకుండా, ఉండడం పట్ల, ఆవేదన వ్యక్తం చేసారు, పాటూరు గ్రామ నాయకులు, పొన్నవోలు, ముద్దు కృష్ణా రెడ్డి, కామ్రేడ్, జక్కా వెంకయ్య, నేటి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, లుకు ఆనాడు బ్రిడ్జి నిర్మాణం గురించి వివరించారు,అని అన్నారు, అయినప్పటికీ, ఎమ్మెల్యే కు, ఎందుకు పట్టలేదని, సిపిఎం డిమాండ్ చేసింది, ఈ రహదారి నిరంతరం, రద్దీ గా ఉంటుంది, ప్రాణాలు అరచేతులో పెట్టుకొని, దాటవలసిన పరిస్థితి ఉండి, చిరు వ్యాపారం చేసే వారు, వాణిజ్య పంటలు రైతులు, గుమ్మళ్లదిబ్బ, మీదుగా, పాటూరు, ముంబయ్, జాతీయ రహదారి కి అను సందాన మైన, రోడ్డు లు కలుస్తుంది, అందరికి, ఎంతో ప్రయెజనమైన, ఈ కలుజు పై, బ్రిడ్జి నిర్మించడం, అన్ని విధాలుగా అవసరం తో పాటు, వర్షా కాలములో, మరింత, అవసరం ఉంద్ది, ఇలాంటి అభివృద్ధి పనులపై, దృష్టిసారించకపొతే, వచ్చే సోమవారం ఇక్కడే సిపిఎం టెంట్ వేసుకొని, ధర్నా, నిరసన లు కొనసాగిస్తామని SK బాబు, హెచ్చరించారు, ఈ కార్యక్రమం లో, సిపిఎం నాయకులు, పందెటి సురేంద్ర, శివ, సురేష్, గోవర్ధన్, విష్ణు, కాలేషా, మల్లికార్జున, ఛానభాష్, భాస్కర్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img