Friday, April 19, 2024
Friday, April 19, 2024

కోతకు గురైన వాగు కరకట్ట

ఈదుమూడి బ్రిడ్జీకి పొంచి ఉన్న ముప్పు

విశాలాంధ్ర-నాగులుప్పలపాడు : మండలంలోని ఈదుమూడి గ్రామం ముంగిట వాగుపై ఉన్న బ్రిడ్జీ వద్ద కరకట్ట కోతకు గురైంది . ఈ బ్రిడ్జి వెంబడి ఉన్న కట్టపై నుంచి బీసీకాలనీకీ వెళ్లాల్సి ఉంది . అయితే వాగు ఉధృతిగా వచ్చిన క్రమంలో బ్రిడ్జీ వెంబడి ఉన్న కట్ట కోతకు గురైంది . దీంతో బ్రిడ్జి కి కూడ ముప్పు పొంచి పొంచి ఉంది . నిత్యం కోతకు గురైతే బ్రిడ్జీతో పాటు సిమెంట్ రోడ్డు కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది . గ్రామానికి వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి . ఈ రహదారిపై వాగు ఉండడంతో దశాబ్దాల పాటు వర్షం వచ్చిన ప్రతి పర్యాయం జలదిగ్భదంలో ఉంటూ గ్రామస్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు . ఈ నేపథ్యంలో షుమారు ఏడేళ్ల క్రితం ఈ బ్రిడ్జీ నిర్మాణం చేపట్టారు . అప్పటి నుంచి ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు తొలిగాయి . ప్రస్తుతం బ్రిడ్జీ కింద కోత పడడంతో బిడ్జి దెబ్బతినే పరిస్థితి లేకపోలేదు . ఈ క్రమంలో తక్షణమే కోతను నివారించాల్సి అవసరం ఉంది . బ్రిడ్జి మరోమారు కోతకు గురికాకుండా మట్టితో కోతను పూడ్చి రివెంట్మెంట్ చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే కోతకు గురైన ప్రాంతంలో 3 కె.వి, 11 కెవి. కరెంటు తెగలు స్తంభానికి ఉన్నాయి ప్రమాదవశాత్తు స్తంభం ఒలిగినచో పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని గ్రామస్తులకు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img