Friday, April 19, 2024
Friday, April 19, 2024

పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత నివ్వడం అభినందనీయం

విశాలాంధ్ర నాగులుప్పలపాడు :- మండంలలోని వివేకానంద సేవాసమితి ఉప్పుగుండూరు వారి ఆధ్వర్యంలో పిన్నక లక్ష్మీనారాయణ జ్ఞాపకార్థంగా వారి శ్రీమతి అనoత లక్ష్మి, మరియు వారి కుమారులు కృష్ణ చైతన్య,అజయ్ ల ఆర్థిక సహకారం తో ఉప్పుగుండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 2021 22 సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనపరచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించి న విద్యార్థులు కట్టా జగదీష్, ఉసురుపాటి జస్వర్ బాబు కట్టా పద్మావతి స్థానాలు పొందిన వారికి రూ 5000, 4000, 3000 ల ఆర్థిక సహాయం కొమ్మాలపాటి అశోక్ చేతులమీదుగా విద్యార్థుల తల్లిదండ్రులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలోపాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈమని వెంకట రమణయ్య, కొల్లా శ్రీనివాసరావు, కామిశెట్టి మహేంద్రనాథ్, ప్రమోద్,పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, బి. వెంకటేశ్వర్లు, కె. సంజీవరావు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరుల పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img