విశాలాంధ్ర నాగులుప్పలపాడు :- రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మండలంలోని చదలవాడ గ్రామ పంచాయతీ కేసినేనివారిపాలెం లో రెండో విడత మూడో రోజు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ అంజమ్మ జడ్పిటిసి యాదాల రత్న భారతి గ్రామ స్థానిక నాయకులు గైర్హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబును కేసినేని వారి పాలెం గ్రామ మహిళలు ఘనంగా పూలమాలతో స్వాగతం పలికారు. గ్రామంలోని మహిళలు గ్రామ ప్రజలు ఆప్యాయంగా పలకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించారు. అనంతరం నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరే విధంగా వాలంటరీ వ్యవస్థను నిర్మించారు. ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే చేరే విధంగా వాలంటరీలు పనిచేయడం అభినందనీయం అన్నారు .మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2024లో మరో మారు ముఖ్యమంత్రిగా గెలిపిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు. అనంతరం మండలంలోని నూతనంగా మంజూరైన 496 పింఛన్లను మండల పార్టీ ముఖ్య నాయకుల చేతుల మీదగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు ఎంపీటీసీలు గ్రామ సర్పంచులు మరియు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.