Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రెండు గంటల్లో ఇంటి పట్టా

గడప గడప కార్యక్రమం లో మహిళ వినతికి మంత్రి స్పందన
అక్కడికక్కడే పట్టా అందజేత

గడప గడప కార్యక్రమానికి వెళ్లిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కు ప్రజలు బ్రాహ్మరధం పట్టారు. పుల్లలచెరువు మండలం ఎండ్రపల్లి గ్రామానికి వెళ్లిన మంత్రి సురేష్ కు పలు వినతులు వచ్చాయి. వాటన్నింటిని స్వయంగా రాసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్న మంత్రి కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఎండ్రపల్లి గ్రామానికి చెందిన చిరదల సువార్త అనే మహిళ తనకు ఇంటి స్థలం లేదని, అర్హత ఉన్నా మంజూరు కాలేదని మంత్రి ఎదుట తన గోడు వెళ్ళబోసుకుంది. వెంటనే స్పందించిన మంత్రి సురేష్ తహసీల్దార్ దాసు ను పిలిపించి విచారించారు. గ్రామంలోని జగనన్న లే ఔట్ లో ఉన్న ప్లాట్ లలో ఒకటి అక్కడికక్కడే మహిళకు మంజూరు చేసి ఇవ్వాలని ఆదేశించారు. రెవిన్యూ సిబ్బంది రెండు గంటల్లో అక్కడికక్కడే పొజిషన్ సర్టిఫికెట్ తయారు చేశారు. మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇన్ని రోజులుగా తనకు పరిస్కారం కాని సమస్య మంత్రి ద్వారా అప్పటికప్పుడు పరిస్కారం కావటంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img