Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి : కలెక్టర్

విశాలాంధ్ర: ఒంగోలు : స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ .ఏ.ఎస్.దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ప్రకాశం భవనంలోని స్పందన హాలులో ఈ ఏర్పాట్లపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే ఈ వేడులకు ఇప్పటి నుంచే పనులు చేపట్టాలని చెప్పారు. ఆహ్వాన పత్రాల పంపిణీ, ప్రొటోకాల్ విషయంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. స్వాతంత్య్ర్య సమరయోధులను, వారి కుటుంబాలను ఆహ్వానిం చాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను తెలియజేసేలా సంబంధిత శాఖలు ప్రత్యేక స్థాళ్లను, శకటాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలను, వారు వాడిన వస్తువులను ప్రజల సందర్శనార్థం ప్రత్యేకంగా ప్రదర్శించాలని అన్నారు. వేడుకలకు హాజరైన ఆహూతులకు సీట్లు కేటాయించే విషయంలో ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. వర్షం పడినా వేడుకలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పైనా దృష్టి పెట్టాలని ఆదేశించారు.. ప్రకాశం జిల్లా ఎస్పీ. మలిక గర్గ్ మాట్లాడుతూ భద్రతాపరంగా ఆవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ట్రాఫిక్ విషయంలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జి డి.ఆర్.ఓ. సరళా వందనం, మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img