Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పారిశ్రామికవేత్త మద్ది లక్ష్మయ్య మృతి

విశాలాంధ్ర మార్టూరు:- పల్నాడు జిల్లా చిలకలూరిపేట కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త మద్ది లక్ష్మయ్య(96) అనారోగ్యంతో హైదరాబాదుఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం వేకువజామున మృతి చెందినట్లు సమాచారం. మద్ది లక్ష్మయ్య ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీలు నిర్వహించి వేలాది మందికి ఉపాధి కల్పించారు, మద్ది లక్ష్మయ్య భౌతికకాయాన్ని చిలకలూరిపేట తీసుకొస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు లక్ష్మయ్య మృతికి సంతాపం తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img