Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రాష్ట్రాన్ని మద్యాంధ్ర ప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్ రెడ్డి దే

మద్యపాన నిషేధం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలను వైసీపీ ప్రభుత్వం మోసం చేయడానికి నిరసిస్తూ ఒంగోలు తెలుగు మహిళల ఆధ్వర్యంలో నగరంలోని ఆర్టీసీ డిపో వద్ద గల ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద తెలుగు మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజా మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే మూడు దశల్లో మద్యపాన నిషేధం చేస్తానని మేనిఫెస్టోలో ప్రకటించిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లయిన మధ్య నిషేధం చేయకపోగా విష రసాయనాలు ఉన్న నాసిరకం మద్యం రాష్ట్రంలో విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటుమాటుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు నిడమానూరి పావని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి సంపద సృష్టించడం చేతగాక మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకొని మద్యంపై వచ్చే ఆదాయం చూపి ఇప్పటికే 58 వేల కోట్లు అప్పులు తెచ్చారని ఆ అప్పులు తీర్చలేక రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెంచి మందుబాబుల రక్తంతో వాళ్ల కుటుంబ సభ్యుల కన్నీళ్లతో అప్పులు తీర్చాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని పూచీ కత్తుగా పెట్టారంటే మరి ఎన్నికల్లో ఇచ్చిన మద్యపాన నిషేధం హామీ సంగతి ఏమిటి జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి సునీత మాట్లాడుతూ కరోనా లాంటి విపత్తు సమయంలో కూడా లాక్ డౌన్ 45 రోజులకు మించిన అవకాశం మరొకటి లేదని గుడులు బడులు తెరవక ముందే మద్యం షాపులను తెరిచి కరోనా వ్యాప్తికి కారణమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే టీచర్ల చేత కూడా కరోనా సమయంలో మద్యం అమ్మించిన ఘనత జగన్ రెడ్డి ప్రభుత్వానిదే అని ఎద్దేవా చేశారు ప్రభుత్వ తీరుతోనే రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు నేరాలు పెరిగిపోయాయని మద్యపాన నిషేధం పై మహిళలను మోసం చేసిన జగన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో మహిళల చే గుణపాఠం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి కామరాజు గడ్డ కుసుమకుమారి, తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్ల వెంకటరత్నం, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి నాలం నరసమ్మ,రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గోనే మేరీ రత్నకుమారి , రాయపాటి సీత, ఒంగోలు పార్లమెంటు మహిళా జనరల్ సెక్రెటరీ బీరం అరుణ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ కార్యదర్శులు గంగవరపు పద్మ, కేశన శేషమ్మ, గోరంట్ల అనురాధ, మండవ లావణ్య,మంగపాటి ప్రశాంతి, ఎల్ టి భవాని, దుర్గా మల్లేశ్వరి, చప్పిడి ప్రభావతి, మేదరమెట్ల పార్వతి,పాదర్తి సుజాత,అంజమ్మ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img