విశాలాంధ్ర సంతనూతలపాడు : మండలంలో ని మోడల్ గ్రామ పంచాయతీలుగా ఎంపిక కాబడిన గుమ్మళం పాడు పి గుడిపాడు మైనంపాడు గ్రామ పంచాయతీలోని పారిశుద్ధ్య కార్యక్రమాలను జడ్పీ సీఈవో జాలి రెడ్డి బుధవారం పరిశీలించారు. ఆయా గ్రామాలలోని ఎస్ డబ్ల్యూ పీసీ షేడ్ల వద్ద తడి పొడి చెత్త వేరు చేసే విధానాన్ని వర్మి కంపోస్ట్ తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలకు పని ఆధారంగా మార్కులను ఇచ్చారు గుమ్మళంపాడు గ్రామ పంచాయతీకి 68 మార్కులు గుడిపాడు గ్రామ పంచాయతీకి 79 మార్కులు మైనంపాడు గ్రామ పంచాయతీకి 74 మార్కులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలలో గ్రామపంచాయతీలో జరిగిన పారిశుద్ధ్యం తదితర కార్యక్రమాల పట్ల గ్రామ కార్యదర్శులను సర్పంచులను సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో డి ఎస్ వి ప్రసాద్ ఈవో ఆర్ డి జి రామకృష్ణ పి ఆర్ ఎ ఈ పి రవి బాబు ఆయా గ్రామాల సర్పంచులు పంచాయితీ కార్యదర్శులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.