Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు

విశాలాంధ్ర – కనిగిరి : ఏఐఎస్ఎఫ్ 87వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కనిగిరి బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం కబడ్డీ పోటీలు జరిగాయి. ఈ పోటీలను సిపిఐ కనిగిరి నియోజకవర్గం కార్యదర్శి సయ్యద్ యాసీన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సిహెచ్ లక్ష్మారెడ్డి ఎంఈఓ ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కబడ్డీ క్రీడాకారులను పరిచయం చేసుకొని ఆటలను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ రావు, ఏఐటియుసి కనిగిరి నియోజకవర్గం అధ్యక్షులు గుజ్జుల బాలిరెడ్డి, ఏఐవైఎఫ్ కన్వీనర్ పుట్ట సుబ్బారావు, ఇఫ్రాస్, చైతన్య, అఖిల్, జాన్, నవీన్, నారాయణ, పవన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img