విశాలాంధ్ర – కనిగిరి : దేశవ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు నిరసన తెలియజేస్తూ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని కనిగిరి కోర్టు నందు గురువారం కనిగిరి న్యాయవాదులు అందరు కలసి కోర్టు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహమ్మద్ వలి,వైస్ ప్రెసిడెంట్ పాశం పిచ్చయ్య,రామన తిరుపతిరెడ్డి,విజయ్ కుమార్, అబ్దుల్ గఫార్,సుబ్బారావు, ఫయాజ్,శ్రీకాంత్ రెడ్డి, కొండలరావు,బాల నారాయణ, నరసారెడ్డి,నాయబ్ రసూల్, ఎస్ మాలకొండారెడ్డి, మీరావాలి,బాలిరెడ్డి,బాలాజీ, ప్రఫుల్ల కుమార్,విద్యా యాదవ్,చంద్రబాబు,తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.