విశాలాంధ్ర- వెలిగండ్ల: నూతనంగా నిర్మించిన గుడిపాటి పల్లి సచివాలయం ఆర్ డి కె లను కనిగిరి శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు టిటిడి పాలకమండ సభ్యులు బుర్ర మధుసూదన్ యాదవ్ ప్రారంభించారు
మంగళవారం మండలంలోని గుడిపాటిపల్లిలో గడపగడపలో భాగంగా నూతన భవనాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం సిద్ధించాలని లక్ష్యంతో గ్రామాలలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలను అందించే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని అందులో భాగంగానే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నారని ఆయన అన్నారు అనంతరం సర్పంచి దంపతులు కటికల వెంకటరత్నం,రిబ్కా, ఎంపీపీ దంపతులు రామణ మహాలక్ష్మి, తిరుపతి రెడ్డిలను సన్మానించారు ఈ కార్యక్రమంలో వెలిగండ్ల సింగిల్ విండో అధ్యక్షులు కాకర్ల వెంకటేశ్వర్లు, నాగూర్ యాదవ్, సేవాదళ్ అధ్యక్షులు చెన్న కిష్టయ్య, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు ఎలుక రమణయ్య, యాదవ్ మండల ప్రధాన కార్యదర్శి గంజి రవీంద్ర రెడ్డి, కన్వీనర్ గజ్జల వెంకట్ రెడ్డి, ఎస్సీ సెల్ జేమ్స్ యువత అధ్యక్షులు తాతపూడి నాని సింగల్ విండో డైరెక్టర్ అంకిరెడ్డి, వెంకట్రామయ్య ,ఎలుక నారాయణ, వైఎస్ఆర్సిపి నాయకులు ప్రజలు వాలంటరీలు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.