విశాలాంధ్ర – అర్ధవీడు : గ్లోబల్ టైగర్ డే పేస్ట్ ని పురస్కరించుకొని అర్ధవీడు మండల పరిధిలోని నాగులవరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల , వీరభద్రాపురం ప్రాథమిక పాఠశాలలో చిత్రలేఖనం పోటీలు గురువారం నిర్వహించారు. వన్యప్రాణి అటవీ అధికారులు నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో పెద్దపులిని గురించిన ఆకర్షణీయమైన చిత్రాలు గిసి వారికి పెద్దపులి పై ఉన్న ఆసక్తిని కనపరచారు. ఈ కార్యక్రమంలో నాగులవరం డెప్యూటీ రేంజ్ అధికారి ముక్కు.ప్రసాద రెడ్డి, మాట్లాడుతూ విజేతగా నిలిచిన చిత్రాలను గ్లోబల్ టైగర్ డే ప్రదర్శన లో ప్రదర్శిస్తామన్నారు.
ఈకార్యక్రమంలో నాగులవారం ఉన్నత పాటశాల ప్రధానోపాధ్యాయులు బాలసుబ్రమణ్యం, ఉపాధ్యాయులు నారాయణరెడ్డి , వీరభద్రాపురం ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ బొగ్గు.వెంకట రెడ్డి అటవీ బీటు అధికారులు ఆండ్రస్, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.