మాజీ జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు
విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : ఉప్పుగుండూరు పాలకేంద్రం అద్యక్షులు, మాజీ సొసైటీ అధ్యక్షులు మాగులూరి రాఘవయ్య గ్రామాభివృద్దిలో కీలకపాత్ర పోషించారని మాజీ శాసనసభ్యులు ఈదర హరిబాబు ,పాలపర్తి డేవిడ్ రాజు లు పేర్కొన్నారు సోమవారం రాఘవయ్య దశదిశకర్మ సందర్బంగా సంతాపసభ నిర్వహించారు ఈసభకు సిపియం మండలకార్యదర్శి టి శ్రీకాంత్ అద్యక్షత వహించారు ఈసందర్బంగా మాజీ జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ గత 40సంవత్సరాలుగా రాఘవయ్య తో మంచి సంబందాలు ఉన్నాయన్నారు. తమగెలుపుకు అయన ఎనలేని కృషిచేసారని కొనియాడారు. ఆయన పలు పదవులు చేపట్టినప్పటికి ఏపనిలో రాజీపడకుండా ప్రతిపదవికి తగు న్యాయం చేసారన్నారు గ్రామంలో ఏఅభివృద్ది పనిజరిగిన ఆయన పాత్ర కీలకంగా ఉండేదన్నారు ఆవిదంగా గ్రామంలో మంచిగుర్తింపు పొందారన్నారు రాఘవయ్య అందరివాడుగా మెలిగారన్నారు ఎవరికి ఏసమస్యవచ్చిన సమన్వయంతో పరిష్కరించేవాడు పార్టీలకతీతంగా ఎంతటి సమస్యనైన ముక్కుసూటిగా ప్రశ్నించేవారు ఏదిఏమైన ఒక మంచివ్యక్తిని కోల్పోయాం అన్నారు. ఈసభలో పలువురు వక్తలు రాఘవయ్యతో అనుబంధం అనురాగం అందరిని ఆప్యాయంగా పలకరించడం కుటుంబంకన్నా ఆయనచేసిన సంఘసేవ ,అనేకపదవల్లో పనిచేసిన తీరు నష్టాలు వచ్చిన వెనకడగు వేయకుండా నిర్మించిన బిల్డింగ్ లు పనులు గురించి వివరించారు గ్రామంలో ఒకమహోన్నత వ్యక్తిని కోల్పోయాం అని భాదాతప్త హృదయంతో విలపించారు ఆయనకుటుంబ సభ్యలకు తమ సానుభూతి తెలిపారు ముందుగా రాఘవయ్య చిత్రపటానికి పలవురు పూలమాలలు వేసి నివాళులర్పంచారు. ఈకార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ మారేళ్ళ బంగారు బాబు, టిడిపి సీనియర్ నాయకులు గోగినేని ఆంజనేయులు, గుమ్మడి సాయిబాబా, మాజీఎంపిపి వీరయ్యచౌదరి , టిడిపి మండల అద్యక్షలు తేళ్ళమనోజ్ , కనగాల శ్రీనివాసరావు , కె సెల్వం ,జాన్సన్, ఆళ్ల ప్రేమ్ చంద్ ,పాలకేంద్రం మాజీ డైరెక్టర్లు బాచిన నాగేశ్వరరావు, చుండూరి నాగేశ్వరరావు, బెల్లం శ్రీనివాసరావు , నల్లూరి భాస్కర్ , జి బసవపున్నయ్య , కాంట్రాక్టరు లక్ష్మినారాయణ, సొసైటీ చైర్ పర్సన్ ఉప్పుగుండూరి శ్రీనివాసప్రసాదు ,సామాజిక సేవాకార్యకర్త టి శామ్యూల్ ,బెల్లం బాబురావు, స్వర్ణ కిషోర్, గుమ్మడి బాబురావు ,గ్రామస్తులు అభిమానులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.