ఎమ్మెల్యే డాక్టర్ స్వామి
విశాలాంధ్ర`పొన్నలూరు : రాష్ట్ర ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిందని కొండపి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ డోల శ్రీ బాల వీరంజనేయ స్వామి అన్నారు. మండలంలోని శుక్రవారం ముప్పాళ్ల, సింగరబోట్లపాలెం, వెల్లటూరు, వేంపాడు పంచాయతీల్లో నిర్వహించిన బాదుడే బాదుడే కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వామి యువనాయకులు దామచర్ల సత్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నాడు అధికారంలోకి రావడానికి ఎన్నో రకాల విమర్శలతో ప్రజలను మోసం చేసిందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే కరెంటు చార్జీలు పెంచనని చెపి నేడు కరెంటు బిల్లును రెండితలు చేశారన్నారు. అలానే నిత్యావసర ధరలు, నాసిరకం మద్యం అమ్మకాల్లో ఏపీ ప్రభుత్వం ముందుందని ఆరోపించారు. అలానే ఎస్సి ఎస్టీ బీసీ కులాలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ దామచర్ల సత్య మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలను దోచుకోవడానికి అధికారంలోకి వచ్చినట్లు వ్యవహరిస్తోందన్నారు. కార్మికులు పొట్ట గొట్టే విధంగా ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుక ప్రవేటు పరం చేసిందన్నారు. నియోజకవర్గ ప్రజలకు సాగు తాగు నీరు కోసం చేపట్టిన సంగమేశ్వరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. త్వరలో సంగమేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతి కొరకు పాదయాత్ర చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు అనుమోలు సాంబశివరావు, మాజీ అధ్యక్షులు కొండ్రగుంట శ్రీనివాసరావు, మండవ ప్రసాద్, సీనియర్ నాయకులు కర్ణా కోటిరెడ్డి, ఉపాధ్యక్షులు తానికొండ మహేంద్ర, మొరబోయిన మాల్యాద్రి, తెలుగు యువత అధ్యక్షులు బోయపాటి రమణారెడ్డి, ఒంగోలు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి మండవ మురళి, ఒంగోలు పార్లమెంట్ ఎస్టీ సెల్ కార్యదర్శి కొటేశ్వరమ్మ, సంగమేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ తాడిబోయిన రమణయ్య, స్థానిక నాయకులు కునం మధవరెడ్డి, శివారెడ్డి, యర్రా నరేంద్ర, దాసరి కృష్ణ, మన్నెం మల్లికార్జున, మన్నెం రమణయ్య, దొంటేటి మధు, దాసరి వెంకయ్యతో పాటు పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.