Friday, April 19, 2024
Friday, April 19, 2024

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

పంపిణీ చేస్తున్న వైసీపీ నాయకులు. విశాలాంధ్ర-పామూరు: అర్హత కలిగిన ప్రతి ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని వైసిపి మండల అధ్యక్షులు గంగసాని హుస్సేన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలములోని చిల్లంకురు , దాదిరెడ్డిపల్లి, ఇనిమెర్ల పంచాయతీలలో నూతనముగా మంజూరైనా చర్మ, డప్పు కళాకారులకు పింఛన్లు ను జెడ్పిటిసి చప్పిడి సుబ్బయ్య మాజీ వైస్ ఎంపీపీ పువ్వాడి రాంబాబు లతో కలిసి హుస్సేన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకముగా పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పర్మినెంట్ అయిన సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సిద్ధ మూర్తి లక్ష్మీనారాయణ రెడ్డి, గట్ల విజయభాస్కర్ రెడ్డి, బద్దిపూడి మార్కు, షేక్ ఖాదర్ బాషా, గోవిందయ్య, చెనికిల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img