Friday, April 19, 2024
Friday, April 19, 2024

వైయస్సార్ నేతన్న నేస్తం ..నేతన్నకు ఆపన్న హస్తం..

విశాలాంధ్ర కనిగిరి
రాష్ట్రంలో చేనేత కార్మికులకు చేనేత పనులను మెరుగుపరిచేందుకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథక యొక్క ముఖ్య లక్షమని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. గురువారం 11వ వార్డు దేవాంగ నగర్ చేనేత కార్మికులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్, కమిషనర్ నారాయణ రావు పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పిన విధంగా చేనేతల కార్మికులు బాధలు చూసి ప్రతి ఏటా సొంత మగ్గాలు ఉన్న నేతన్న కార్మికుల బ్యాంకుల్లో రూ.24 వేలు నేరుగా జమ చేస్తున్నారని, ఐదేళ్లలో ప్రతి లబ్ధిదారునికి రూ. 1.20లక్షల మొత్తం సహాయాన్ని అందుతుందన్నారు. కుల మత వర్గ రాజకీయ పార్టీలకు అతీతంగా లంచాలు వివక్షత, పక్షపాతానికి తావు లేకుండా సొంత మగ్గం ఉన్న అర్హులందరికీ సంతృప్తి లబ్ధి పొందేలా నేతన్నల ఆర్థిక అభివృద్ధి జీవన ప్రమాణాలు పెంచడమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. కమిషనర్ నారాయణరావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా నేతలకు లబ్ధి కూర్చే పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అర్హులై సొంత మగ్గం కలిగి ప్రతి కుటుంబానికి ఏడాది రూ .24 వేలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. అర్హులై ఒకవేల ఏ కారణం అనంతరం నేతన్న కార్మికులు చైర్మన్ అబ్దుల్ గఫార్ కమిషనర్ నారాయణ రావు కు షాలువాతో పూలమాలతో సత్కారంచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాణిక్యరావు, కౌన్సిలర్లు శ్రీరాం సతీష్ ,దేవరాజు, మెప్మా టీఎంసి రఘు ,గుడ్ హెల్ప్ రమేష్ బాబు,చేనేత కార్మికులు రామా రావు, వీరయ్య, వెంకట సుబ్బాయ్య, ప్రసాద్ వైసీపీ నాయకులు మన్సూర్, భారతి, నాగూర్ భీ
తదితరలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img