Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

భారీగా గుట్కా, మద్యం పట్టివేత

విశాలాంధ్ర – గుంతకల్లు : పట్టణంలోని బళ్లారి చౌరస్తాలో భారీగా గుట్కా, కర్ణాటక మద్యం పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.8 లక్షల వరకు ఉంటుందని పోలీసు అధికారులు వివరించారు. స్థానిక వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇన్‌ఛార్జి డీఎస్పీ చైతన్య కేసు వివరాలను వెల్లడిరచారు. గుంతకల్లు వన్‌టౌన్‌ సీఐ నాగశేఖర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేష్‌ కుమార్‌ సంయుక్తంగా బళ్లారి చౌరస్తాలో దాడులు నిర్వహించి గుట్కా, కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా బేతంచర్లకు చెందిన అదిశేషు, ప్రకాశం జిల్లాకు చెందిన పోలేశ్వరరావు గుట్కా రవాణా చేయడానికి ఒప్పందం కుదుర్చుకుని. కొనుగోలు చేసిన సరుకును తాడిపత్రి మండలం బుగ్గ గ్రామానికి తరలిస్తారు. ఆ తరువాత మరో వాహనంలో ప్రకాశం జిల్లాకు తరలిస్తారని ఆయన వివరించారు. ముందుగా అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి ఐచర్‌ వాహనాన్ని అదుపులోకి తీసుకుని గుట్కా, కర్ణాటక మద్యం పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులు ఆదిశేషు, పోలేశ్వరరావు, సయ్యద్‌ యూసుఫ్‌ బాషా, శేక్షావలి, రామకృష్ణలను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో ఇద్దరిని త్వరలో పట్టుకుంటామని చెప్పారు. స్వాధీనం చేసుకున్న గుట్కా, మద్యం విలువ 8 లక్షల వరకు ఉంటుందన్నారు.
గుట్కాను పట్టుకున్న పోలీసులకు ఎస్పీ ఫకీరప్ప చేతుల మీదుగా రివార్డులు అందజేస్తామని అన్నారు. గుట్కా, కర్ణాటక మద్యం పట్టుకోవ డానికి సహకరిం చిన ఎస్‌ఐలు సురేష్‌ బాబు, కొండయ్య, సిబ్బందికి డీఎస్పీ చైతన్య అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img