దుబాయ్ : ఐపీఎల్లో మరోసారి కరోనా కలకలం సృష్టిస్తోంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోని ప్రధాన బౌలర్ నటరాజన్ వైరస్ బారిన పడ్డాడు. ఆయనకు సన్నిహితంగా ఉన్న ఆరుగురు ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నారు. అయితే టీమ్లోని ఇతర ఆటగాళ్లకు కొవిడ్ నెగటివ్గా తేలిన నేపథ్యంలో బుధవారం దిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ యథావిధిగా జరుగుతుందని బీసీసీఐ పేర్కొంది. ఆల్రౌండర్ విజయ్ శంకర్, విజయ్ కుమార్(టీమ్ మేనేజర్), శ్యామ్ సుందర్ జే(ఫిజియోథెరపిస్ట్), అంజనా వన్నన్(డాక్టర్), తుషార్ ఖేడ్కర్ (లాజిస్టిక్స్ మేనేజర్), పెరియసామి గణేశన్(నెట్ బౌలర్).. నటరాజన్కు సన్నిహితంగా మెదిలినట్లు సన్రైజర్స్ వైద్య బృందం గుర్తించింది. ప్రస్తుతం వీరు ఐసోలేషన్లో ఉన్నారు.