Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

ఐపీఎల్‌ ‘ప్లేఆఫ్‌’పై ఉత్కంఠ

న్యూదిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌ 16 లో ప్లేఆఫ్‌ రేసు ఉత్కంఠభరితంగా మారింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌ ముగిసిన తర్వాత ప్లేఆఫ్‌ పరిస్థితిపై కాస్త స్పష్టత వచ్చింది. హైదరాబాద్‌పై విజయం సాధించడం ద్వారా ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా గుజరాత్‌ నిలిచింది. అదే సమయంలో హైదరాబాద్‌ ప్లేఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ముంబై ఇండియన్స్‌, సీఎస్‌కే, ఆర్‌సీబీలకు ప్లేఆఫ్‌కు చేరే అవకాశాలు మరింతగా పెరిగాయి. ఇక ధోనీ సేన (సీఎస్కే) ప్రస్తుతం 15 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. తన చివరి మ్యాచ్‌లో విజయం సాధించగలిగితే, ప్లేఆఫ్స్‌లో స్థానం ఖాయం అవుతుంది. చివరి మ్యాచ్‌లో ఓడిపోతే ప్లేఆఫ్‌ టికెట్‌ను పొందడానికి సీఎస్కే ఇతర జట్లపై ఆధారపడాల్సి రావచ్చు. కాగా ముంబై ఇండియన్స్‌ ఇప్పటి వరకు 14 పాయింట్లు సాధించింది. ముంబై ఇండియన్స్‌కు రెండు మ్యాచ్‌లు మిగిలున్నాయి. ఇందులో ఒక్కటైనా ముంబై ఇండియన్స్‌ గెలిస్తే ప్లేఆఫ్‌కు చేరుకోవడం ఖాయం. కాగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ ప్రస్తుతం 13 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. లక్నో కూడా మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే లక్నో ప్లేఆఫ్‌ టికెట్‌ ఖాయం అవుతుంది. అయితే ఒక మ్యాచ్‌ గెలిస్తే, లక్నో ఇతర జట్లపై ఆధారపడవలసి ఉంటుంది. ఆర్సీబీ కూడా ప్లేఆఫ్‌ రేసులోనే ఉంది. ఈ జట్టు 12 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు సాధించింది. తన చివరి రెండు మ్యాచ్‌లను గెలిస్తే… ఆర్సీబీ ప్లేఆఫ్‌ టికెట్‌ను పొందడం ఖాయం. ఒక మ్యాచ్‌లో ఓడిపోతే, ప్లేఆఫ్‌కు చేరుకోవడం కేవలం నెట్‌ రన్‌ రేట్‌పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇక రాజస్థాన్‌ రాయల్స్‌ కేవలం 12 పాయింట్లను మాత్రమే కలిగి ఉంది. ప్లే ఆఫ్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. పంజాబ్‌ కింగ్స్‌ మాత్రం ప్లేఆఫ్‌ రేసులో కొనసాగుతోంది. అదే సమయంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కేకేఆర్‌, దిల్లీ క్యాపిటల్స్‌ ప్లేఆఫ్‌ రేసులో లేవు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img