ముంబై: భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్పై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఏటీఏ) 21 నెలల నిషేధం విధించింది. ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో ఏటీఏ ఈ మేరకు చర్యలు తీసుకుంది. దీపాపై ఈ ఏడాది జులై 10 వరకు నిషేధం అమలులో ఉంటుందని పేర్కొంది. నిషేధిత ఉత్ప్రేరకం హిగనమైన్ పరీక్షలో ఆమె పాజిటివ్గా తేలినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఆమె డోపింగ్కు పాల్పడినట్లు రుజువైంది. 2021 అక్టోబర్ 11న దీపా కర్మాకర్ నుంచి శాంపిల్స్ సేకరించారు. అప్పుడే డోపింగ్ టెస్టులో పట్టుబడిరది. కానీ, ఈ విషయాన్ని ఇప్పుడు ప్రకటించారు. శిక్షాకాలం అప్పటి నుంచి అమలుకావడంతో 2023 జులై 10తో నిషేధం ముగుస్తుంది. 2016లో రియో ఒలింపిక్స్లో వాల్ట్లో దీపా కర్మాకర్ నాలుగో స్థానం సాధించింది.
ఈ విషయంపై దీపా కర్మాకర్ ట్విటర్లో ఓ పోస్టు చేసింది. ‘ఈ రోజు నా కోసం, నా కెరీర్ కోసం నేను చేసిన సుదీర్ఘ పోరాటానికి ముగింపు లభించింది. 2021 అక్టోబర్లో నా నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షించడానికి పంపారు. నేను నిషేధిత పదార్థాన్ని తీసుకున్నట్లు అందులో తేలింది. అది ఎలా నా శరీరంలోకి చేరిందో గుర్తించలేకపోయాను. నాపై రెండేళ్లు సస్పెన్షన్ విధించినట్లు చాలా మీడియా సంస్థల్లో వార్తలొస్తున్నాయి. అవన్నీ తప్పుడు కథనాలు. నా శిక్షా కాలాన్ని మూడు నెలలు తగ్గించారు. దీంతో జూలై 2023లో తిరిగి నాకిష్టమైన ఆటను మళ్లీ మొదలుపెడతా’ అని దీపా కర్మాకర్ పేర్కొంది.