కొలంబో : శ్రీలంక స్టార్ క్రికెటర్ లసిత్ మలింగ టీ20లకు వీడ్కోలు పలుకు తున్నట్లు ప్రకటించాడు. దీంతో అతడు అంతర్జాతీయ క్రికెట్కు పూర్తిగా స్వస్తి చెప్పేసినట్లు అయ్యింది. మలింగ ఇప్పటికే టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్ ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. టీ20లకు మంగళవారం రిటైర్ మెంట్ ప్రకటించడంతో అధికారికంగా అతడు అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నట్లయ్యింది. 2014లో మలింగ సారథ్యంలోనే శ్రీలంక టీ20 ప్రపంచకప్ గెలిచింది.