రషీద్ఖాన్ భావోద్వేగం
లండన్ : అఫ్గానిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. దేశంలో తాలిబన్ల విధ్వంసకాండ చూసి అతను చలించిపోయాడు. ‘ఈరోజు అఫ్గానిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం. దేశం కోసం మనమందరం కొంత సమయాన్ని కేటాయిద్దాం. దేశం కోసం చేసిన త్యాగాలను ఎప్పటికీ మరవలేము. శాంతియుత అఫ్గాన్ రాజ్య స్థాపన కోసం మనమందరం ప్రార్థిద్దాం. ఐక్యరాజ్యసమితి నుంచి సాయం ఆశిస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ప్రస్తుతం తాలిబన్ల ఆక్రమణలతో ఉన్న దేశ ప్రజలు ఈసారి స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా ఉన్నారు. కాగా ప్రస్తుతం అఫ్గాన్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్ల భవి ష్యత్తు గందర గోళం లో పడిరది. రషీద్ ఖాన్, మహ్మద్ నబీ లాంటి స్టార్ క్రికెటర్లు ఐపీఎల్ తదితర లీగ్ల్లో పాల్గొం టామని ఇదివరకే ప్రకటించారు. అయితే, మిగాతా అఫ్గాన్ జాతీయ క్రికెటర్ల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచకప్లో అఫ్గానిస్థాన్ పాల్గొంటుందా లేదా అన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. తాలిబన్లు మొదటి నుంచి క్రికెట్ను వ్యతిరేకిస్తున్నారు.