పూణె : పూణెలోని దక్షిణ కమాండ్ క్యాంపస్లోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ (ఏఎస్ఐ) చెందిన అథ్లెటిక్స్ స్టేడియంకు టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా పేరు పెట్టనున్నారు. నీజర్ చోప్రా ఘన తను గుర్తించేందుకు, అలాగే ఈ స్టేడియంలో శిక్షణ తీసుకుంటున్న అథ్లెట్లలో స్ఫూర్తి నింపేందుకు 23వ తేదీన జరిగే ఒక కార్యక్రమంలో స్టేడియంకు నీజ్ పేరు పెట్టనున్నామని ఆర్మీ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎంఎం నరవణె, దక్షణ ఆర్మీ కమాండర్ లె. జన రల్ జేఎస్ నయన్ హజ రవు తారని అధికారి పేర్కొ న్నారు. స్టేడి యంను అత్యాధునిక వసతు లతో తీర్చి దిద్దామని, ఒలింపిక్స్ పతకం గెలి చిన తర్వాత తొలి సారిగా స్టేడియంకు రానున్న నీరజ్కు తాము ఇచ్చే బహుమతి ఇదేనని ఆయన అన్నారు. నీరజ్ చోప్రా సైన్యంలో సుబేదార్గా విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.