లండన్ : ప్రతి నెలా క్రికెటర్లకు అవార్డులను ఇచ్చే ఐసీసీ ఈసారి ఓ ప్రత్యేక పురస్కారం ప్రకటిం చింది. ఆ అవార్డు దక్కింది క్రికెటర్కు కాదు ఓ శునకానికి అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఐర్లాండ్లో ఒక టీ20 మ్యాచ్ జరుగుతుండగా మధ్యలో దూసు కొచ్చిన ఈ శునకం బంతిని నోట కరుచుకుని మైదానంలో పరుగులు పెట్టి చివరికి బ్యాట్స్మన్కు ఇచ్చేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇప్పుడు ఆ కుక్కనే ఐసీసీ ఈ ప్రత్యేక అవార్డుకు ఎంపిక చేసింది. బంతిని నోట కరుచుకుని.. టోపీ పెట్టుకుని ఉన్న కుక్క ఫొటోను ఐసీసీ పోస్టు చేసింది.