Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

‘ఈకటా’ చాంపియన్‌ ‘షినే’

అభినందించిన కలెక్టర్‌ మిశ్రా

విశాలాంధ్ర ఏలూరు : ప్రపంచ ఆన్‌లైన్‌ ‘ఈకటా’ చాంపియన్‌ షిప్‌ 2021 పోటీల్లో చాంపియన్‌ షిప్‌, మూడు గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన గంటా షినేను కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అభినందించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కార్యాలయంలో కార్తికేయ మిశ్రాను షినే మర్యాదపూర్వకంగా కలుసుకుంది. మెడల్స్‌, సర్టిఫికెట్స్‌ను చూపించింది. ఈ చాంపియన్‌ షిప్‌ సాధించడం చాలా ఆనందంగా ఉందని భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని కలెక్టర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆకివీడు మండలం అజ్జమూరు గ్రామానికి చెంది గంటా షినే భీమవరం ఆదిత్య జూనియర్‌ కాలేజ్‌లో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనెల 5`8 వరకు తెలంగాణలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 30 దేశాల నుంచి 2300 మంది పాల్గొన్నారు. మన రాష్ట్రం నుంచి పాల్గొన్న గంట షినే వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ సాధించడంతోపాటు గోల్డ్‌ మెడల్స్‌ కూడా సాధించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img