తాజా సర్వేలో వెల్లడి
నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్పై ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుందని మనకు తెలిసిందే.అయితే ఈసారి ఈ క్రీడలపై పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడం లేదని తాజా సర్వేలో వెల్లడైంది. కరోనా మహమ్మారితోపాటు హైప్రొఫైల్ అథ్లెట్లు(గోల్ఫ్ మాజీ నంబర్ వన్ ఆడమ్ స్కాట్, ఫుట్బాల్ స్టార్ నెయ్మార్, టెన్నిస్ స్టార్లు ఫెదరర్, నదాల్, సెరెనా విలియమ్స్ తదితరులు) ఈసారి ఈ క్రీడలకు దూరంగా ఉండటంతో ఆసక్తి తగ్గినట్లు తేలింది. ఇప్సోస్ అనే సంస్థ 28 దేశాల్లో సర్వే నిర్వహించింది. కేవలం 46 శాతం మంది మాత్రమే ఒలింపిక్స్పై ఆసక్తిగా ఉన్నట్లు సర్వేలో తేలింది.ఈ నెల 23 నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి.