Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఉషూ పోటీల్లో సిక్కోలు ప్రతిభ

4 స్వర్ణాలతో కలిపి మొత్తం ఐదు పతకాలు కైవసం
జాతీయ జూనియర్స్‌, యూత్‌ ఉషూ పోటీలకు నలుగురి ఎంపిక
శ్రీ సెప్టెంబర్‌ 1 నుంచి 6 వరకు కేరళలో పోటీలు

విశాలాంధ్ర`శ్రీకాకుళం స్పోర్ట్స్‌/క్రైం: రాష్ట్రస్థాయి ఉషూ పోటీల్లో సిక్కోలు క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచారు. జులై 30, 31 తేదీల్లో గుంటూరు జిల్లా నల్లపాడు వేదికగా 8వ ఏపీ జూనియర్స్‌, యూత్‌ బాలబాలికల ఉషూ చాంపియన్‌ షిప్‌-2022 పోటీలు జరిగాయి. ఈ పోటీలకు శ్రీకాకుళం జిల్లా నుంచి మొత్తం ఐదుగురు క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించగా ఐదుగురు పతకాలు సాధించారు. నాలుగు బంగారు పతకాలతోపాటు ఒక రజత పతకం సాధించారు. బంగారు పతకాలు సాధించిన నలుగురు ఆటగాళ్లు 21వ ఆలిండియా జూనియర్స్‌, యూత్‌ ఉషూ చాంపియన్‌ షిప్‌-2022 పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలు కేరళలోని కాలికట్‌ వేదికగా సెప్టెంబర్‌ 1 నుంచి 6వరకు జరగనున్నాయి. పతకాలు సాధించిన క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉషూ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎన్‌.మోహన ముత్యాలరావు, తైక్వాండో జిల్లా కార్యదర్శి కొమర భాస్కర్‌, ఉషూ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శివకుమార్‌, సంఘ ప్రతినిధులు చంగలరావు, రెడ్డి సాయికుమార్‌, ఒలింపిక్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి పి.సుందరరావు మాస్టారు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్‌ కోచ్‌ ఎం.మాధురీలత, సెటశ్రీ సీఈఓ బీవీ ప్రసాదరావు, పీఈటీల సంఘ నాయకులు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img