Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఐపీఎల్‌ వీక్షణకు స్టేడియాల్లోకి అనుమతి


దుబాయ్‌ : యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్‌-2021లో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రేక్షకులను స్డేడియాల్లోకి అనుమతించాలని నిర్ణయించారు. అయితే పరిమిత స్థాయిలోనే అనుమతించనున్నట్లు బీసీసీఐ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడిరచింది. యూఏఈలో కోవిడ్‌ పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో.. ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కాగా సెప్టెంబర్‌ 19న ముంబై ఇండియన్స్‌, సీఎస్‌కే మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌ 2021 ఫేజ్‌ 2 ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌తో పాటు టోర్నిలో మిగిలిన మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు సెప్టెంబర్‌ 16 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి.
ఐపీఎల్‌ 2021 గత మార్చిలో ఇండియాలో ప్రారంభమైనా.. కరోనా కారణంగా వాయిదా పడిరది. టోర్నీ రెండోదశ సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్‌ రెండోదశలోని మ్యాచ్‌లను దుబాయ్‌, షార్జా, అబుదాబి వేదికల్లో నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img