58కి చేరిన పాజిటివ్ కేసులు
మరో మూడు రోజుల్లో టోక్యో ఒలింపిక్స్ మొదలుకానుంది. భారత్ నుంచి మొదటి విడతగా కొంతమంది ప్లేయర్లు టోక్యో చేరుకుని, ప్రాక్టీస్లో మునిగిపోయారు. అయితే క్రీడా గ్రామంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 58 మంది కరోనా బారిన పడినట్లు ప్రకటించారు. తాజాగా చెక్ రిపబ్లిక్కు చెందిన బీచ్ వాలీబాల్ ప్లేయర్ ఒండ్రెజ్ పెరుసిక్కు కొవిడ్ పాజిటివ్గా నిర్థారణయ్యినట్లు పేర్కొంది. కఠిన నిబంధనలు పాటించినా వారు వైరస్ బారిన పడ్డారని ఆ దేశ ఒలింపిక్స్ కమిటి పేర్కొంది.