కట్టడి చేసిన బౌలర్లు
హర్షల్ పటేల్ అరంగేట్రం
రాణించిన గప్టిల్,మిచెల్
రాంచీ: మూడు టీ20ల సిరీస్లో భాగంగా రెండో టీ20 మ్యాచ్లో భారత్కు న్యూజిలాండ్ 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ నెగ్గిన టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకుని కివీస్కు బ్యాటింగ్ అప్పగించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ద్వారా హర్షల్ పటేల్ భారత టీ20 జట్టులోకి అరంగేట్రం చేశాడు. సిరాజ్ బదులు తుది జట్టులోకి వచ్చాడు. భారీ స్కోరు సాధిస్తుందనుకున్న కివీస్ను భారత బౌలర్లు అడ్డుకున్నారు. తొలుత బ్యాటింగ్కు దిగిన కివీస్కు ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ (31), డారిల్ మిచెల్ (31) శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించారు. తొలి వికెట్కు 48 పరుగులు జోడిరచారు. అయితే గప్టిల్ ఔటైన తర్వాత కివీస్ పరుగుల వేగం మందగించింది. అడపాదడపా బౌండరీలు ఇచ్చినా.. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మిడిలార్డర్ బ్యాటర్లు మార్క్ చాప్మన్ (21), గ్లెన్ ఫిలిప్స్ (34) దూకుడుగా ఆడటంతో న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోరును చేయగలిగింది. మిగిలిన బ్యాటర్లలో సీఫర్ట్ 13, నీషమ్ 3, సాట్నర్ 8 నాటౌట్, మిల్నే 5 నాటౌట్ పరుగులు చేశారు. అరంగేట్ర బౌలర్ హర్షల్ పటేల్ (2/25) రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్తో బౌలింగ్ చేయించక పోవడం గమనార్హం. భారత బౌలర్లలో హర్షల్ 2, దీపక్ చాహర్, భువనేశ్వర్, అక్షర్ పటేల్, అశ్విన్ తలో వికెట్ తీశారు.