షార్జా : ఐపీఎల్లో భాగంగా మంగళవారం నాడిక్కడ దిల్లీ కేపిటల్స్ జట్టుతో జరిగిన టీ20 మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టోర్నీలో ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. సీజన్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న దిల్లీ క్యాపిటల్స్కు కేకేఆర్ షాకిచ్చింది. దిల్లీ విధించిన 128 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలో ఛేదించింది. మొదట ఓపెనర్ గిల్ 30 పరుగులతో రాణించగా.. నితీశ్ రానా (36) తనదైన బ్యాటింగ్తో జట్టుకు విజయాన్ని అందించాడు. సునీల్ నరేన్ చివర్లో 10 బంతుల్లో 21 పరుగులతో మెరిశాడు. దిల్లీ బౌలర్లలో ఆవేశ్ఖాన్ 3, అశ్విన్, లలిత్ యాదవ్, రబడ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ సీజన్లో బ్యాటింగ్లో మంచి ప్రదర్శన కనబర్చిన దిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్లో తేలిపోయారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన దిల్లీకి శుభారంభం దక్కినా తర్వాత తడబడిరది. ఓపెనర్లు స్మిత్, ధావన్ మొదటి వికెట్కు 35 పరుగులు జోడిరచారు. అనంతరం దూకుడు మీదున్న గబ్బర్ను ఫెర్గుసన్ పెవిలియన్ చేర్చాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ (1) విఫలమయ్యాడు. వ తర్వాత పంత్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు స్మిత్. వీరిద్దరూ మూడో వికెట్కు 37 పరుగులు జోడిరచాక స్మిత్ (39) ఔటయ్యాడు. కాసేపటికే హెట్మెయర్(4), లలిత్ యాదవ్ (0), అక్షర్ పటేల్ (0), అశ్విన్ (9) పెవిలియన్కు క్యూ కట్టారు. ఓవైపు వరుస వికెట్లు కోల్పోతున్నా పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్లో రెండు పరుగులకు ప్రయత్నించిన పంత్ (39) రనౌట్గా వెనుదిరిగాడు. దీంతో దిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకు పరిమితమైంది. కోేల్కతా బౌలర్లలో నరైన్, ఫెర్గూసన్, వెంకటేశ్ అయ్యర్ రెండేసి వికెట్లు పడగొట్టగా, సౌథీ ఒక వికెట్ పడగొట్టాడు.