దుబాయ్ : క్రీడాస్ఫూర్తి.. ఇది ఏ ఆటలోనైనా క్రీడాకారులకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. అందుకు టీమిండియా, పాక్ ఆటగాళ్లు కూడా మినహాయింపు కాదు. ముఖ్యంగా టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ, ప్రస్తుత సారథి విరాట్ కోహ్లి క్రీడాస్ఫూర్తి చాటడంలో ముందుంటారు. ఆ విషయాన్ని తాజాగా మరోసారి నిరూపించారు. గతరాత్రి పాకిస్థాన్తో ఓటమిపాలయ్యాక విరాట్.. బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ దగ్గరికెళ్లి హత్తుకొని మరీ నవ్వుతూ అభినందించాడు. ఈ సన్నివేశాలు ఇరు జట్ల అభిమానులను ఆకట్టుకున్నాయి. మరోవైపు మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఎలా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఆన్ఫీల్డ్ అయినా, ఆఫ్ ఫీల్డ్ అయినా తనదైన వ్యక్తిత్వంతో ఆకట్టుకుంటాడు. సింపుల్గా ఉంటూ ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతాడు. ఈ క్రమంలోనే ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతాడు. భారత్-పాక్ మ్యాచ్ అనంతరం అతడు మైదానంలోనే పలువురు దాయాది జట్టు ఆటగాళ్లతో కలిసి ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆటకు సంబంధించిన కొన్ని విషయాలను వారితో సంతోషంగా పంచుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో వైరల్గా మారింది. ఇది కదా నిజమైన క్రీడాస్ఫూర్తి అంటూ భారత్-పాక్ క్రికెట్ జట్లను మెచ్చుకుంది. దాయాదుల పోరుపై బయట ఉండేటంత భావోద్వేగం, ఉద్రేకం లాంటివి రెండు జట్ల మధ్య ఉండవని అభిప్రాయపడిరది.