విశాలాంధ్ర-రాప్తాడు: గోవాలో సాఫ్ట్బాల్ టోర్నీ ప్రారంభమైంది. పనాజీ జిల్లాలో 13వ సాఫ్ట్బాల్ నేషనల్ ఫెడరేషన్ కప్ టోర్నమెంట్ను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రారంభించారు. క్రీడాకారులంతా అకుంఠితదీక్షతో ఆడి గెలవాలని అన్నారు. 37వ నేషనల్ సాఫ్ట్బాల్ గేమ్స్ కూడా తమ రాష్ట్రంలోనే అక్టోబరులో జరుగుతాయని ఆయన చెప్పారు. ఈ టోర్నమెంట్ సందర్భంగా ఏపీ సాఫ్ట్బాల్ సీఈవో సి.వెంకటేసులును సీఎం ప్రత్యేకంగా అభినందించారు.