టోక్యో : ఒలింపిక్స్లో టెన్నిస్ నెంబర్ వన్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఓటమి పాలయ్యాడు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో జర్మనీ ఆటగాడు జ్వెరెవ్పై 1-6, 6-3, 6-1 తేడాతో పరాజయం పాలయ్యాడు. దీంతో ఒలింపిక్స్ స్వర్ణ పతకం గెలవాలన్న ఇతడి ఆశలు ఆవిర య్యాయి. ఇటీవలే తన ఆరో వింబుల్డన్ టైటిల్ గెలిచిన జకో.. కెరీర్లో 20 గ్లాండ్స్లామ్లతో స్విస్ దిగ్గజం ఫెదరర్, నాదల్ సరసన చేరాడు. ఈ సీజన్లో ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ దక్కించుకున్న సెర్బియన్ స్టార్.. ఒలింపిక్స్లోనూ స్వర్ణమే లక్ష్యంగా బరిలో దిగాడు. కానీ నిరాశతో వెనుదిరిగాడు.