ఇంగ్లండ్ చేతిలో బంగ్లా చిత్తు
అబుదాబి : టీ20 వరల్డ్ కప్ సూపర్-12 పోరులో ఇంగ్లండ్ జట్టు మరో విజయం నమోదు చేసింది. బుధవారం బంగ్లాదేశ్ తో అబుదాబిలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ అన్ని రంగాల్లో సత్తా చాటుతూ 8 వికెట్ల తేడాతో గెలు పొందింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు కేవలం 14.1 ఓవర్లలోనే ఛేదించడం విశేషం. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో హైలైట్ అంటే ఓపెనర్ జాసన్ రాయ్ గురించి చెప్పుకోవాలి. రాయ్ 38 బంతులు ఎదుర్కొని 61 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాయ్ స్కోరులో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ జోస్ బట్లర్ 18 పరుగులు చేసి అవుటైనా… డేవిడ్ మలాన్ (28 నాటౌట్), జానీ బెయిర్ స్టో (8 నాటౌట్) మరో వికెట్ పడ కుండా మ్యాచ్ను ముగించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లాం, నసూమ్ అహ్మద్ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు.