లండన్ : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐదో స్థానానికి పడిపోగా, ఫాస్ట్బౌలర్ బుమ్రా.. తిరిగి టాప్-10లోకి ప్రవేశించాడు. టీ-20 ఆల్రౌండర్ల జాబితాలో షకీబ్ మళ్లీ అగ్రస్థానానికి చేరాడు. ఇంగ్లాండ్తో తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన బుమ్రా 10 స్థానాలు మెరుగు పర్చుకుని 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. నాటింగ్హామ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో 9 వికెట్లు తీశాడు. 2019 సెప్టెంబర్లో కెరీర్లో అత్యుత్తమంగా మూడో స్థానానికి చేరిన బుమ్రా.. ఆ తర్వాత క్రమక్రమంగా దిగువకు జారిపోయాడు. కొద్దిరోజులుగా టెస్టుల్లో అంచనాలను అందుకోలేకపోతున్న సారథి విరాట్ కోహ్లీ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో ఐదుకు పడిపోయాడు. ఇంగ్లాండ్పై తొలి ఇన్నింగ్స్లో డకౌట్ కావడంతో ఓ స్థానం కోల్పోయాడు. కాగా తొలి టెస్టులో వరుసగా 64, 109 పరుగులు చేసిన ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. భారత ఓపెనర్ రోహిత్శర్మ, వికెట్కీపర్ రిషభ్ పంత్ 6,7 స్థానాల్లో కొనసాగుతున్నారు. తొలి టెస్టులో మంచి ప్రదర్శన చేసిన అగ్రశ్రేణి స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలోనే ఉన్నాడు. ఆసీస్ పేసర్ ప్యాట్? కమిన్స్ తొలి స్థానంలో ఉన్నాడు. ఇక శార్దుల్ ఠాగూర్ 19 స్థానాలు మెరుగు పర్చుకుని 55వ స్థానంలో నిలిచాడు. టీ-20 ఆల్రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్ ఆటగాడు షకీబుల్ హసన్ తిరిగి అగ్రస్థానం దక్కించుకున్నాడు. బ్యాట్స్మెన్ జాబితాలో 53, బౌలర్ల జాబితాలో 12లో కొనసాగుతున్నాడు. బంగ్లా బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ తిరిగి టాప్-10లోకి ప్రవేశించాడు.