Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలిపతకం


మీరాబాయి చానుకు రజతం

టోక్యో ఒలింపిక్స్‌లో శనివారం వెయిట్‌ లిఫ్టింగ్‌లో మణిపూర్‌కి చెందిన మీరాబాయి చాను దేశానికి రజత పతకాన్ని అందించింది. 49 కిలోల వెయిట్‌ లిప్టింగ్‌ ఈవెంటులో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మీరాబాయి చరిత్ర సృష్టించింది. మహిళల 49 కేజీల విభాగంలో పోటీపడిన మీరాబాయి.. స్నాచ్‌లో 87 కేజీలను లిప్ట్‌ చేసి.. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115 కిలోలను లిప్ట్‌ చేయడం ద్వారా భారత్‌కి పతకాన్ని ఖాయం చేసింది. మొత్తంగా 202 కిలోలను మీరాబాయి లిప్ట్‌ చేయగా.. చైనా క్రీడాకారిణి జిహు ఒలింపిక్స్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ మొత్తంగా 210 కేజీలను లిప్ట్‌ చేసింది. ఇక ఇండోనేషియా లిప్టర్‌ ఆసిప్‌ా 194 కేజీలతో కాంస్యంతో సరిపెట్టుకుంది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్‌ లిప్టర్‌ కరణం మల్లీశ్వరి తొలిసారి కాంస్య పతకాన్ని భారత్‌కి అందించగా.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ మీరాబాయి వెయిట్‌ లిప్టింగ్‌లో పతకం కొరతని తీర్చింది.టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి కచ్చితంగా పతకం గెలుస్తుందని ఇటీవల దిగ్గజ వెయిట్‌ లిప్టర్‌ కరణం మల్లీశ్వరి జోస్యం చెప్పింది. తాజాగా అదే నిజమైంది.భారత్‌ నుంచి 119 మంది క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్నారు. ఇందులో 67 మంది ఫురుషులు, 52 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img