Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

తుది జట్టుపై తర్జన భర్జన

. సూర్య, గిల్‌… ఒకరికే అవకాశం
. నేడు నాగపూర్‌లో తొలిటెస్టు

నాగపూర్‌: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 9 (గురువారం) నుంచి బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ నాగపూర్‌ వేదికగా జరగనుండగా. ఈ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. కాగా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ కి వెళ్లాలంటే ఈ సీరీస్‌ కచ్చితంగా గెలవాలి. దీంతో క్రికెట్‌ అభిమానుల దృష్టి అంతా ఇప్పుడు ఈ మ్యాచ్‌పైనే ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా తుది కూర్పుపై ఊహాగానాలొస్తు న్నాయి. అయితే కంగారూ లను ఢీకొట్టే తుది జట్టుపై కికెట్‌ విశ్లేషకుల అంచనాల ప్రకారం… 11మంది గల జట్టులో ఏడు స్థానాలపై ఎటువంటి సందేహాలు లేవు. రోహిత్‌ శర్మ, ఛతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌కు చోటు పక్కా. వీళ్ల గత ఆటతీరు, ఫామ్‌, రికార్డులు.. ఇలా ఏవి చూసుకున్నా.. వీళ్ల ప్లేస్‌ గురించి ఆలోచనే అవసరం లేదు. జడేజా గత కొన్ని నెలలుగా గాయం కార ణంగా దూరంగా ఉన్నా.. ఇటీవల రంజీలో దుమ్మురేపి జట్టులోకి వచ్చాడు. మిగతా నాలుగు స్థానాల మీదే చర్చ నడుస్తోంది. ఆ స్థానాల కోసం శుభ్‌మన్‌ గిల్‌, సూర్య కుమార్‌ యాదవ్‌, కె.ఎస్‌.భరత్‌, ఇషాన్‌ కిషన్‌, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ అందుబాటులో ఉండగా, ముగ్గురు తుది జట్టులో ఉంటారు. అయితే వాళ్లెవరూ అనేదానిపై చర్చ నడు స్తోంది. మిగిలిన నాలుగు స్థానాల్లో మూడో స్పిన్నర్‌ విషయానికొస్తే… టెస్టులు, అందు లోనూ భారత్‌లో టెస్టులు అంటే మూడో స్పిన్నర్‌గా అక్షర్‌ పటేల్‌కి ఓటేస్తారు చాలా మంది. అయితే అక్షర్‌ కంటే కుల్‌దీప్‌ యాదవ్‌ అయితే నయమనే మాటలు వినిపిస్తున్నాయి. జడేజా, అక్షర్‌ బౌలింగ్‌ స్టయిల్‌ కాస్త దగ్గరదగ్గరగా ఉంటాయని, అందుకే వైవిధ్యం కోసం కుల్‌దీప్‌కు చోటివ్వాలని కొందరు మాజీలు సూచిస్తు న్నారు. ఎలాంటి పిచ్‌ మీదనైనా బంతిని తిప్పేయడం అక్షర్‌ కంటే కుల్‌దీప్‌కే సాధ్యం అనేది చర్చ. అయితే బ్యాటింగ్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటే అక్షర్‌కే ఎక్కువ మార్కులు పడతాయి. రెండోది వికెట్‌ కీపర్‌
రిషబ్‌ పంత్‌ స్థానంలో రేసులోకి కె.ఎస్‌.భరత్‌, ఇషాన్‌ కిషన్‌ వచ్చారు. పంత్‌ స్థానానికి ఇషాన్‌ అతికినట్లు సరిపోతాడు కానీ రంజీట్రోఫీల్లో బ్యాటింగ్‌లోను, కీపింగ్‌లోనూ అదరగొట్టడం, జట్టులో చాలా రోజులు బెంచ్‌ మీద ఉండటం లాంటి అంశాలు భరత్‌కు కలిసొస్తాయి అంటున్నారు పరిశీలకులు. గాయంతో శ్రేయస్‌ అయ్యర్‌ జట్టుకు దూరం అవ్వడంతో ఆ స్థానం కోసం సూర్య కుమార్‌ యాదవ్‌, శుభ్‌మన్‌ గిల్‌ పోటీ పడుతున్నారు. ఇప్పటికే గిల్‌ టెస్టుల్లో మూడు అర్థ సెంచరీలు, ఒక సెంచరీతో అదర గొట్టాడు. దీంతో గిల్‌, సూర్య మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఫామ్‌కి ఓటేస్తారా.. తొలి ఛాన్స్‌ ఇచ్చి టెస్టులకు సూర్యని పరిచయం చేస్తారా అనేది చూడాలి. టీమ్‌లో పంత్‌ లేని నేపథ్యంలో దూకుడైన ప్లేయర్‌ కావాలంటే సూర్య ఉండాల్సిందే. ఇటీవలి ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుంటే గిల్‌ను తీసుకుం టారు. అయితే మిడిలార్డర్‌లో ఆడటానికి సిద్ధం అని కేఎల్‌ రాహుల్‌ ఇటీవల చెప్పిన నేపథ్యంలో ఓపెనింగ్‌ స్థానం ఖాళీ అని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే శుబ్‌మన్‌కే ఫైనల్‌ 11లో చోటు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ భరత్‌ బదులు ఇషాన్‌ను తీసుకుంటే.. అతను ఓపెనింగ్‌ చేస్తాడు కాబట్టి.. అప్పుడు సూర్యకు జట్టులో చోటు ఉండొచ్చు. గిల్‌ బెంచ్‌కే పరిమితమవుతాడు. దానికితోడు రాహుల్‌ మిడిలార్డర్‌లోనే రాణిస్తుండటంతో.. జట్టు యాజమాన్యం కొత్త ఓపెనర్‌ ఆలోచ నలో పడిరది అంటున్నారు. ఒకవేళ ఓపెనర్‌ అనే పాయింట్‌ చర్చకు వస్తే.. సూర్యకి కష్టమే. ఇక చర్చలో ఉన్న మరో అంశం మూడో పేసర్‌. అయితే అనూహ్యంగా ముగ్గురు పేసర్లతో భారత్‌ బరిలోకి దిగాలి అనుకుంటే అక్షర్‌/ కుల్‌దీప్‌ స్థానంలో జయదేవ్‌ ఉనద్కత్‌ వచ్చే అవకాశం ఉంది.
తుది జట్టు అంచనా:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కె.ఎల్‌.రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), ఛెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌/ శుబ్‌మన్‌ గిల్‌, కె.ఎస్‌.భరత్‌/ ఇషాన్‌ కిషన్‌ (కీపర్‌), రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ / కుల్‌దీప్‌ యాదవ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమీ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img