Friday, April 19, 2024
Friday, April 19, 2024

తొలి వన్డే మనదే

ఐదు వికెట్ల తేడాతో ఆసీస్‌పై టీమిండియా ఘన విజయం

ముంబై: భారత్‌`ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో శుక్రవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత ఆసీస్‌ను 188 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా… మరో పది ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అధిగమించింది. టెస్టు సిరీస్‌లో విఫలమైన కేఎల్‌ రాహుల్‌ (75) గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. అతనికి ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (45) సహకారం అందించాడు. అజేయంగా నిలిచిన వీరిద్దరూ ఆరో వికెట్‌కు 108 పరుగులు జోడిరచారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 83 పరుగులకే సగం వికెట్లు పడినా రాహుల్‌ ఒత్తిడికి లోనవ్వుకుండా నిదానంగా ఆడాడు. ఐదో వికెట్‌గా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (25) వెనుదిరిగాక.. జడేజా, రాహుల్‌ జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నారు. వీరిద్దరూ ఒకటి, రెండు పరుగులు తీస్తూ, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోర్‌బోర్డు వంద దాటిం చారు. ఆ తర్వాత ఆసీస్‌ పేస్‌ దళాన్ని ఎదుర్కొంటూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ మూడు, మార్కస్‌ స్టోయినిస్‌ రెండేసి వికెట్లు తీశారు.
టాపార్డర్‌ విఫలం
లక్ష్యం చిన్నదే అయినా పిచ్‌ అనుకూలించడంతో ఆసీస్‌ ప్రధాన పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ రెచ్చిపో యాడు. బంతిని స్వింగ్‌ చేసిన అతను పవర్‌ప్లేలో కీలకమైన వికెట్లు తీసి భారత్‌ను దెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్‌లో స్టార్క్‌, విరాట్‌ కోహ్లీ(4), సూర్యకుమార్‌ యాదవ్‌ (0)ను ఎల్బీగా వెనక్కి పంపాడు. సూర్య వన్డేల్లో డకౌట్‌ కావడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత శుభ్‌మన్‌ గిల్‌ (20)ను ఔట్‌ చేసి టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టాడు. అతని దెబ్బకు ఒక దశలో 52 పరుగులకే 4 వికెట్లు పడ్డాయి.
మార్ష్‌ ఒక్కడే…
మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 188 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆసీస్‌ బ్యాటర్లలో మిచెల్‌ మార్ష్‌ ఒక్కడే భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. బౌండరీలు, సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. 65 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 81 పరుగులు సాధించాడు. లబుషేన్‌తో కలిసి మూడో వికెట్‌కు 52 పరుగులు జోడిరచాడు. 129 పరుగుల వద్ద జడేజా, మార్ష్‌ను ఔట్‌ చేసి టీమిండియాకు బ్రేక్‌ ఇచ్చాడు. అక్కడి నుంచి ఆసీస్‌ వికెట్ల పతనం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన జోష్‌ ఇంగ్లిస్‌ (26), కామెరూన్‌ గ్రీన్‌ (12), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (8), మార్కస్‌ స్టోయినిస్‌ (5) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. భారత బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీయడంతో ఆసీస్‌ రెండొందల లోపే ఆలౌట్‌ అయింది. షమీ, సిరాజ్‌ మూడేసి వికెట్లు తీశారు. జడేజా రెండు, కుల్దీప్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img