దుబాయ్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భారత జట్టుతో కలిసాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ను చాంపియన్గా నిలబెట్టిన మహీ.. ఇప్పుడు భారత జట్టుకు టీ20 ప్రపంచకప్ అందించే పనిలోపడ్డాడు. టీ20 ప్రపంచకప్ కోసం భారత నియంత్రణ క్రికెట్ మండలి(బీసీసీఐ) ధోనీని టీమిండియా మెంటార్గా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టుతో చేరిన మహీ.. తన పనిని మొదలుపెట్టాడు. టీమిండియా ప్రాక్టీస్ శిబిరంలో పాల్గొని ఆటగాళ్ల సన్నాహకాలను పరిశీలించాడు. హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్లతో సుదీర్ఘంగా చర్చించాడు. వీటికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్ వేదికగా పంచుకుంది. ‘కొత్త పాత్రలో భారత జట్టులోకి వచ్చిన కింగ్ మహేంద్ర సింగ్ ధోనీకి సాదర స్వాగతం.’అని బీసీసీఐ క్యాప్షన్గా పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి